Hartog Committee 1929

 హార్టాగ్‌ కమిటీ (1929)

  • ఇంటర్‌, డిగ్రీ స్థాయిల్లో ఉపాధ్యాయుల కోసం విద్య ఒక సబ్జెక్టుగా ఉండాలి
  • 1919లో రౌలత్‌ చట్టాన్ని బ్రిటిష్‌వారు ఏర్పాటు చేశారు
  • రౌలత్‌ చట్టం పనితీరును మెరుగుపరచడం, విద్యను కూడా ఒక అంశంగా చేరుస్తూ 1927లో సైమన్‌ కమిషన్‌ను ఏర్పాటు చేశారు.
  • భారత జాతీయ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో సైమన్‌ గో బ్యాక్‌ అనే నినాదంతో ఉద్యమం
  • ఈ కమిషన్‌లో ఢాకా యూనివర్సిటీలో పని చేసిన సభ్యుడు- సర్‌ ఫిలిప్‌ హార్టాగ్‌.
  • వీరు ప్రాథమిక విద్య ముందుకు కొనసాగకపోవడానికి గల కారణాలు మారుమూల గ్రామీణ ప్రాంతాలు, రవాణా, సౌకర్యాలు లేకపోవడం, పేదరికం, నిరక్షరాస్యత, కులం, మతం, అనారోగ్యం ప్రధాన కారణం వీటితో పాటు వృథా/అపవ్యయం/వేస్టేజ్‌ అంటే మధ్యలో చదువు మానేయడం, దీన్ని నియంత్రించడానికి పర్యవేక్షకుల సంఖ్యను పెంచాలి. స్తబ్దత/నిలుపుదల/Stagnation- అంటే ఒకే తరగతిలో ఎక్కువ కాలం కొనసాగడం. అందువల్ల ఉపాధ్యాయులకు నాణ్యతతో కూడిన శిక్షణ, అర్హతలను పెంచడంతో పాటువేతనాలను పెంచాలి
  • ఉన్నత పాఠశాల స్థాయిలో వాణిజ్య, పారిశ్రామిక కోర్సులను ప్రవేశపెట్టాలి.
  • యూనివర్సిటీల్లో విద్యా ప్రమాణాలు పెంచి గ్రంథాలయాలు స్థాపించాలి.
  • 1921లో ప్రాథమిక విద్యా నిర్వహణ బాధ్యత భారత మంత్రులకు అప్పగించాలి. దీని కోసం 1921లో CABE (కేంద్రీయ విద్యా సలహా బోర్డు) ఏర్పాటు చేసి ఆర్థిక మాంద్యం కారణంగా రద్దు చేశారు.
  • హార్టాగ్‌ సిఫారసులతో 1935లో CABE పని చేయటం ప్రారంభం, పర్యవేక్షకుల సంఖ్యను పెంచడం, శాస్త్రీయ దృక్పథంతో కూడిన పాఠ్య ప్రణాళికలు ఏర్పాటయ్యాయి. విద్యా విస్తరణను నిలుపుచేసి విద్యా ప్రమాణాలను పెంపొందించాలని పేర్కొనడంతో 1930 నుంచి 1937 మధ్యలో అనేక పాఠశాలలను మూసివేశారు.

Comments

Popular posts from this blog

విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం ( Educational Psychology ) - Practice

Prime & Composite Numbers

Why students hate maths?